TS 10th Class Exams 2022 Evaluation Start on June 2:
● 10 రోజుల్లో ఒకే విడతలో పూర్తికి ఏర్పాట్లు
- 23 నుంచి జూన్ ఒకటి వరకు టెన్త్ పరీక్షలు
తెలంగాణ రాష్ట్రంలో ఎస్సెస్సీ జవాబు పత్రాల మూల్యాంకనాన్ని జూన్ రెండు నుంచి 11 వరకు నిర్వహించనున్నారు. సెలవు రోజులు, ఆదివారాల్లోనూ మూల్యాంకనం జరుగనున్నది. ఒకే విడతలో 10 రోజుల్లో మూల్యాంకనం పూర్తయ్యేలా అధికారులు షెడ్యూల్ రూపొందించారు. ఈ నెల 23 నుంచి జూన్ ఒకటి వరకు టెన్త్ (ఎస్సెస్సీ) పరీక్షలు జరుగనున్నాయి.
ప్రధాన పరీక్షలు జూన్ 28న ముగియనున్నాయి. వొకేషనల్ సహా మరికొన్ని పేపర్లకు జూన్ ఒకటి వరకు పరీక్షలు జరుగనున్నాయి.ఎస్సెస్సీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల నామినల్ రోల్స్లో తప్పులుంటే సవరించుకోవాలని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ ఏ కృష్ణారావు సూచించారు. వివరాలకు 040 –23230942, 23230941, dirgovexams. ts@gmail.com సంప్రదించాలని కోరారు.
Post a Comment